Bird Flu: దేశంలో ఓ వైపు కరోనా కలకలం కొనసాగుతుండగా మరోవైపు బర్డ్ఫ్లూ వైరస్ వార్తలు మనుషులను భయపెడుతున్నాయి. గత మంగళవారం దేశంలో తొలి బర్డ్ఫ్లూ మరణం నమోదైంది. హర్యానాకు చెందిన 11 సంవత్సరాలు బాలుడు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా బారినపడి ఢిల్లీ ఏయిమ్స్లో మృతి చెందాడు. దీంతో ప్రజలు భయకంపితులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు!
Read More: Corona: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మళ్లీ అదే పరిస్థితా?
బర్డ్ ప్లూ విషయంలో ఇది నిజం…
బర్డ్ ప్లూ భయాందోళనల గురించి ఢిల్లీ ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే హెచ్5ఎన్1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదేనని, వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకడం గుర్తించలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఫౌల్ట్రీల్లో పని చేసే వారంతా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఎయిమ్స్ డైరెక్టర్ సూచించారు. వైరస్తో బాలుడు మృతి చెందిన ప్రాంతంలో ఫౌల్ట్రీల్లో మరణాలపై ఆరా తీయాలన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాల్సిన అవసరం ఉందని, నమూనాలు సైతం తీసుకోవాలన్నారు. గతంలో ఫౌల్ట్రీల్లో బర్డ్ఫ్లూ కేసులు నమోదైన సమయంలో ప్రారంభంలోనే వ్యాప్తిని నివారించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు.
Read More: Corona: కరోనా థర్డ్ వేవ్ లో డేంజర్ డేస్ ఎప్పుడో తెలుసా?
ఇందుకే బర్డ్ ప్లూ రాదు..
మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ మాట్లాడుతూ ఇన్ఫ్లూయెంజా జూనోసిస్ అని, ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు ఆధారాలు లేవన్నారు. సరిగ్గా వండిన ఫౌల్ట్రీ ఉత్పత్తులను తినే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆహారం వండినప్పుడు వైరస్ నాశనమవుతుందని తెలిపారు.