Breaking: తమిళనాడులోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మధురై జిల్లా తిరుమంగళం ఉసిలంబట్టి ప్రాంతంలో గల బాణాసంచా తయారీ ప్యాక్టరీలో జరిగింది. ఘటన సమాచారం తెలియడంతో పోలీస్, ఫైర్ శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి.