Breaking: దేశంలోని 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్గడ్ గవర్నర్ గా బదిలీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏపి సూతన గవర్నర్ గా సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి .. మహారాష్ట్రకు కొత్త గవర్నర్ గా రమేశ్ బైస్ ను నియమించారు. రమేశ్ ఇప్పటి వరకూ ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్, అసొం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివ్ ప్రతాప్ లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరో వైపు లద్ధాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్ కే మాథుర్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రా ను లద్ధాఖ్ ఎల్జీగా నియమించారు. మణిపూర్ గవర్నర్ గా ఉన్న లా గణేశన్ ను నాగాలాండ్ గవర్నర్ గా బదిలీ చేశారు. బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ ను మేఘాలయ గవర్నర్ గా నియమితులైయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను బీహార్ గవర్నర్ గా బదిలీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నాటి నుండి వీరి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ పేర్కొంది.
Delhi Liquor Scam Case: మాగుంట రాఘవరెడ్డి పది రోజుల ఈడీ కస్టడీ