Breaking: ఢిల్లీ, హర్యానాలోని 20కిపైగా ప్రదేశాల్లోని గ్యాంగ్ స్టర్ ల రహస్య స్థావరాలపై ద్వారాకా జిల్లా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుండి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. క్రిమినల్ ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తుల నివాసాలు, స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల సందర్భంలో పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది.
విదేశాలలో తలదాచుకున్న గ్యాంగ్ స్టర్లు, వారి సహచరుల రహస్య స్థావరాలపై దాడులు చేశారు. సోనిపట్, ఝజ్జర్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీలు కొనసాగుతున్నట్లు ద్వారకా డీసీపీ హర్షవర్థన్ తెలిపారు. ఢిల్లీలోని ఒక ప్రదేశం నుండి రూ.20లక్షల స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది. ఇతర ప్రాంతాల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ టిల్లూ పురియాను ప్రత్యర్ధి గ్యాంగ్ సభ్యులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత పోలీసులు ఈ దాడులు చేపట్టారు.
Breaking: కుప్పకూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన .. తప్పిన పెను ప్రమాదం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?