NewsOrbit
జాతీయం న్యూస్

Goa: పదవ తరగతి పరీక్షలపై గోవా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..! ఏమిటంటే..?

Goa: పదవ తరగతి పరీక్షల నిర్వహణపై గోవా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి  ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు జరుగుతోంది. రాష్ట్రంలో నిత్యం  ప్రస్తుతం నిత్యం 1500లకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1621 పాజిటివ్ కేసులు నమోదు కాగా 42 మంది కరోనాతో మృతి చెందారు. 17,277 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసి క్లాస్ 12 పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పలు  రాష్ట్రాల్లోనూ పదవ తరగతి పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి.

Goa CM Pramod Sawant key decision on 10 th class exams
Goa CM Pramod Sawant key decision on 10 th class exams

ఈ నేపథ్యంలో గోవాలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. అంతర్గత మార్కుల ఆధారంగా 10వ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా క్లాస్ 12 పరీక్షల (ఇంటర్) నిర్వహణకు సంబంధించి నిర్ణయాన్ని రెండు రోజుల్లో తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

Goa CM Pramod Sawant key decision on 10 th class exams
Goa CM Pramod Sawant key decision on 10 th class exams

ఏపి, కర్నాటకలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేయలేదు. ఈ రాష్ట్రాల్లోనూ విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీల నుండి పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ పరీక్షల రద్దుకు ప్రభుత్వాలు సుముఖంగా లేవు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షల నిర్వహిస్తామని తెలుపుతున్నాయి. ప్రస్తుతం కర్నాటకలో లాక్ డౌన్ అమలు అవుతుండగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్నది.

ప్రస్తుతం ఏపిలో నిత్యం 18 వేల నుండి 20 వేల వరకూ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ శాతం కూడా గతం కంటే మెరుగ్గా ఉండటం కొంత ఊరట నిస్తున్నది. గడచిన 24 గంటల్లో 18,767 కేసులు నమోదు అయ్యాయి. గత నెలతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనబడుతోంది. పాజిటివిటీ రేటు 25.5 నుండి 20.48కి తగ్గింది. 24 గంటల్లో 104 మంది కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా 2వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella