Goa: పదవ తరగతి పరీక్షల నిర్వహణపై గోవా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు జరుగుతోంది. రాష్ట్రంలో నిత్యం ప్రస్తుతం నిత్యం 1500లకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1621 పాజిటివ్ కేసులు నమోదు కాగా 42 మంది కరోనాతో మృతి చెందారు. 17,277 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసి క్లాస్ 12 పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లోనూ పదవ తరగతి పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి.
ఈ నేపథ్యంలో గోవాలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. అంతర్గత మార్కుల ఆధారంగా 10వ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా క్లాస్ 12 పరీక్షల (ఇంటర్) నిర్వహణకు సంబంధించి నిర్ణయాన్ని రెండు రోజుల్లో తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.
ఏపి, కర్నాటకలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేయలేదు. ఈ రాష్ట్రాల్లోనూ విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీల నుండి పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ పరీక్షల రద్దుకు ప్రభుత్వాలు సుముఖంగా లేవు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షల నిర్వహిస్తామని తెలుపుతున్నాయి. ప్రస్తుతం కర్నాటకలో లాక్ డౌన్ అమలు అవుతుండగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్నది.
ప్రస్తుతం ఏపిలో నిత్యం 18 వేల నుండి 20 వేల వరకూ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ శాతం కూడా గతం కంటే మెరుగ్గా ఉండటం కొంత ఊరట నిస్తున్నది. గడచిన 24 గంటల్లో 18,767 కేసులు నమోదు అయ్యాయి. గత నెలతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనబడుతోంది. పాజిటివిటీ రేటు 25.5 నుండి 20.48కి తగ్గింది. 24 గంటల్లో 104 మంది కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా 2వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.
Class 10 exams of Goa Board stand cancelled, due to prevailing COVID19 situation in the state. Class 10 students to be promoted to next class based on marks obtained in internal assessment. Decision on Class 12 exams to be taken in the next 2 days: CM Pramod Sawant
(file photo) pic.twitter.com/KzvUrcXYUB
— ANI (@ANI) May 23, 2021