Goa: భారతదేశంలో ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా సందర్శించాలనుకునే రాష్ట్రం గోవా. చాలామంది విదేశీయులు.. ఇంక దేశంలో ఉండే సెలెబ్రిటీలు గోవా రాష్ట్రంకి వెళ్లి సేద తీరుతారు. గోవా ప్రభుత్వం పర్యాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. అక్కడ ఉండే బీచ్ లు… స్వేచ్ఛ.. ఎంతోమంది టూరిజం లవర్స్ ని ఆకట్టుకుంటుంది. అటువంటి గోవా రాష్ట్రంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే బహిరంగంగా ఎక్కడా కూడా మద్యం సేవించకూడదని… కొత్త రూల్స్ పాస్ చేయడం తెలిసిందే. ఈ విషయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త రూల్ గోవా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల ఎంపికకి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు కనీసం ఏడాది పాటు… ఏదైనా ప్రైవేటు సంస్థలో పని చేసినా అనుభవం తప్పనిసరి అని సూచించడం జరిగింది. ఈ మేరకు నిబంధనలలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి అనుభవం లేని వారిని నేరుగా ప్రభుత్వ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల.. అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇటీవల తెలియజేశారు.
ప్రైవేటు సంస్థలలో అనుభవం రూల్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తారని పేర్కొన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో… ఈరోజు తప్పనిసరి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో నిరుద్యోగులు గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మండిపడుతున్నారు. కరోనా తర్వాత ఉన్న ఉద్యోగాలే ఉడిపోతున్నాయి. ఇటువంటి షరతులు పెట్టడం వల్ల వయసు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే పరిస్థితి ఉండదు అంటూ.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గోవా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా నిరుద్యోగులకు బిగ్ షాక్ అంటున్నారు