Green Fungus: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో కరోనా నుండి కోలుకున్న వారిని ఫంగస్ టెన్షన్ వెంటాడుతోంది. బ్లాక్, వైట్, ఎల్లో, క్లీమ్ ఫంగస్ కేసులు ఇప్పటి వరకూ వెలుగు చూడగా తాజాగా గ్రీన్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. రెండు రోజుల క్రితం మధ్య ప్రదేశ్ ఇండోర్ లో ఓ వ్యక్తి గ్రీన్ ఫంగస్ బారినపడినట్లు అధికారులు గుర్తించగా పంజాబ్ లోని జలందర్ లో మరో కేసు తాజాగా వెలుగుచూసింది. ఈ వైరస్ ప్రభావం రోగులపై ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇటీవలే కరోనా నుండి కోలుకున్న ఓ వ్యక్తిలో గ్రీన్ ఫంగస్ గుర్తించినట్లు జలంధర్ లోని జిల్లా అసుపత్రి ఏపిడెమియాలజిస్ట్ డాక్టర్ పరమ్ వీర్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పేషంట్ అబ్జర్వేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ కేసుకు ముందు మరో కేసు వచ్చింది కానీ దృవీకరించబడలేదన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇది తొలి గ్రీన్ ఫంగస్ కేసుగా నమోదు అయ్యింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గ్రీన్ ఫంగస్ బారిన పడిన రోగిని అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైసెన్స్ వైద్యులు ముంబై ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
గ్రీన్ ఫంగస్ పేషంట్స్ లో అధిక జ్వరం, ముక్కులోంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఫంగస్ పై మరింత అధ్యయనం చేయడం అవసరమని భావిస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న తరుణంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న వారిలో కొందరు ఫంగస్ బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Punjab | We've received out first confirmed case of green fungus. Patient had recovered from COVID, he is under observation, can't say stable though. There was another case before, but it was unconfirmed: Dr Paramvir Singh, Dist Epidemiologist at Civil Hospital, Jalandhar(19.06) pic.twitter.com/7QxvoJFYw3
— ANI (@ANI) June 20, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?