GST Council Meeting: కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలను తీసుకున్నది. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నులను తగ్గించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ రోజు జీఎస్టీ మండలి భేటీ జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను నిర్మాలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. కరోనా మందులు, పరికరాలపై పన్నులు తగ్గించినట్లు తెలిపారు. వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. 5 శాతం జీఎస్టీ యథావిధిగా అమలు అవుతుందని స్పష్టం చేశారు. ఈ మినహాయింపులు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ చెల్లుబాటులో ఉంటాయని నిర్మాలా సీతారామన్న తెలిపారు.
- కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే టోసిలిజుమాబ్, అంఫోటెరిసిన్ – బీ ఇంజక్షన్లపై జీఎస్టీ మినహాయింపు
- ఆక్సిజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ 12 నుండి శాతం తగ్గింపు
- ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు
- కోవిడ్ చికిత్సలో ఉపయోగించే మూడు రకాల మందులపై జీఎస్టీ తగ్గింపు
- రెమ్డెసివిర్ పై 12 శాతం నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు
- వ్యాక్సిన్, టెంపరేచర్ కొలిచే పరికరాలపై 5 శాతం జీఎస్టీ యథాతథం
- అంబులెన్స్ లపై28 నుండి 12 శాతం శాతానికి జీఎస్టీ తగ్గింపు
- శ్మాశాన వాటికల్లో వినియోగించే ఫర్నెస్ లపై 5 శాతం జీఎస్టీ తగ్గింపు
- హ్యాండ్ శానిటైజర్ల పై జీఎస్టీ తగ్గింపు