Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కులు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలైయ్యారు. మృతుల్లో స్కూల్ విద్యార్ధులు ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు, కులు నుండి రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాాచారం. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా సుజ్జునుజ్జు అయ్యింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈఘటన ఉదయం ఎనిమిది గంటలకు జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాగా బస్సు ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ స్పందించారు. ప్రైవేట్ బస్సు ప్రమాదం గురించి తనకు సమాచారం అందిందన్నారు. మొత్తం యంత్రాంగం సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారనీ, మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు సీఎం జైరామ్ ఠాకూర్.