Hindu: చాలామంది హిందువుల్లో కలిగే సందేహం ఓ కోర్టు ముందుకు కేసు రూపంలో వచ్చింది. హిందువులు ఆలయాలకు వెళ్తుంటారు. భక్తితో కానుకలు సమర్పించుకుంటారు. గుడుల అభివృద్ధి కోసం భూములు, డబ్బులు ఇస్తుంటారు. ఇలాంటివి పాలకులు తమ అవసరాలకోసం వాడుకోవడం, ఇతర మతస్తులకు సైతం వినియోగించుకోవడం ఏంటని అనేక మంది అంటుంటారు. అలాంటి విషయంలోనే మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేవాలయాల భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని, వాటి మీద వచ్చే ఆదాయం కూడా ఆలయాల అభివృద్ధికి, హిందువుల కోసమే వాడాలని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఈ విషయంలో ప్రభుత్వాలు దొంగల మాదిరిగా వ్యవహరించకుండా.. ఆ ఆదాయాన్ని ఇతర కార్యక్రమాలకు, ఇతర మతాలకు ఇవ్వకూడదని తేల్చిచెప్పింది.
ఇది అసలు విషయంలో…
తమిళనాడులో నడుస్తున్న సేవ్ టెంపుల్స్ ఉద్యమంలో భాగంగా, వేసిన ప్రజా వ్యాజ్యానికి మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. 1985 సమయంలో తమిళనాడులో దేవాలయాల భూములు 5 లక్షల ఎకరాలుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 4 లక్షల 50 వేలకు తగ్గింది. మిగతా 50 వేల ఎకరాల లెక్క చెప్పాలంటూ… కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని వెంటనే అప్పజెప్పాలంటూ.. ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలని తేల్చి చెప్పింది. దేవాలయం, వాటి అధికారుల అధీనంలో మాత్రమే ఉండాలని, ప్రభుత్వాలు వాటిపై పెత్తనం చేయకూడదని తెలిపింది. దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడపరాదని చెప్పింది.
Read More: Fasting: హిందువులు ఉపవాసం ఎలా చెయ్యాలి ??
ఆ విషయం పాలకులకు తెలియదా?
హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే దేవాలయ ఆదాయాన్ని ఉపయోగించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాతలు హిందూ దేవాలయాలకు, హిందూ దేవుడికి భూములు ఇచ్చారని, దానిని హిందూ ధర్మం కోసమే ఉపయోగించాలని సూచించారు. దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయాలని, హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని, అన్యమతస్తులకు కాదని స్పష్టం చేశారు. మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఎస్సార్ మహదేవన్ ఇపుడు ఈ తాజా తీర్పు వెలువరించడం విశేషం. కాగా, మహదేవన్ బెంచ్కు కేసు వస్తుందంటే… హిందువులు అలర్ట్ అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.