Corona: ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను వణికిస్తున్న తరుణంలో మరోవైపు ఇంకో షాకింగ్ ఎపిసోడ్తో ప్రముఖ దేశం కలవరపాటుకు గురవుతోంది. కరోనా సమస్య కంటే ఎలుకల సమస్య ఎక్కువ కావడంతో వాటిని మహమ్మారి సరసన చేర్చుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇదే సమయంలో మనదేశం సహాయం కోరింది.
Read More: Corona: షాక్ఃకరోనా టీకా పనిచేయడం లేదని కేసు పెట్టాడు
ఆస్ట్రేలియాలో ఇదీ పరిస్థితి…
ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో ఎలుకలు సృష్టిస్తున్న తలనొప్పులు ఆ దేశ ప్రజలు భరించలేకపోతున్నారు. నిద్రపోతున్న సమయంలో కరవడం, పంటలు నాశనం, ఇండ్లలో వైర్లు, ఫైళ్లు నాశనం చేడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చింది.
న్యూ సౌత్ వేల్స్లో ఎలుకల సంఖ్య వేగంగా పెరగడం వల్ల ‘మౌస్ ప్లేగు అలర్ట్’ ప్రకటించారు. పొలాలు, ఇళ్ళు, పైకప్పులు, పాఠశాలలు, దవాఖానల్లోకి ఎలుకలు ప్రవేశిస్తున్నాయని వ్యవసాయ మంత్రి ఆడమ్ మార్షల్ తెలిపారు. ఎలుకలను నాశనం చేయలేని పక్షంలో రానున్న రోజుల్లో న్యూసౌత్ వేల్స్ ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎలుకల వల్ల ప్రజలు జబ్బు పడటమే కాకుండా పంటనష్టం తీవ్రంగా ఉందని అటు అధికారులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read More: Eatela Rajendar: ఈటలకు ఇంకో రకంగా షాక్ లు ఇస్తున్న టీఆర్ఎస్
భారత్ సహాయం కోరారు…
తమకు చుక్కలు చూపిస్తున్న ఎలుకలను పట్టేందుకు ప్రత్యేకంగా మనుషులను పెట్టుకుంటున్నారు ఆస్ట్రేలియన్లు. పంటలు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీంతో ఎలుకల్ని చంపేందుకు 5 వేల లీటర్ల బ్రోమోడియోలోన్ విషాన్ని పంపాలని భారత్ను కోరింది. ఈ విషయంలో త్వరలో భారత్ తన సహాయం చేయనున్నట్లు సమాచారం.