IPS pooja Yadav: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కలలను సాకారం చేసుకోవచ్చు. ఇదే స్పూర్తితో ఓ యువతి ఎంతో కష్టపడి రిసెప్షనిస్ట్ నుండి ఐపీఎస్ స్థాయికి ఎదిగి ఎందరికో స్పూర్తి దాయకంగా నిలుస్తున్నారు. హర్యానాకు చెందిన పూజా యాదవ్ సక్సెస్ స్టోరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరీ యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించారు ఆమె.
Read More: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త..!! ఐబీపీఎస్ నోటిఫికేషన్..!! భారీగా ఖాళీలు..!!
హర్యానాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన పూజా యాదవ్ బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ లో ఎంటెక్ పూర్తి చేసిన పూజా యాదవ్ కొంత కాలం కెనడా, జర్మనీలో ఉద్యోగం చేశారు. కానీ ఏమి చదవినా, ఏ ఉద్యోగం చేసినా ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. తాను విదేశాల అభివృద్ధి కోసం పని చేస్తున్నాననీ, తన మాతృభూమి కోసం ఏమి చేయడం లేదని అనుకున్నారు. దాంతో తన ఉద్యోగాన్ని వదిలివేసి భారత్ కు విచ్చేసింది. ఐపీఎస్ అవ్వాలన్న ఆమె కలను సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. కుటుంబ సభ్యులు అందరూ తనకు మద్దతుగా నిలిచినా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పిల్లలకు ట్యూషన్ లు చెప్పారు పూజా యాదవ్. కొంత కాలం రెసెప్షనిస్ట్ గా కూడా ఉద్యోగం చేశారు.
తన లక్ష్యాన్ని చేరుకునేందుకు యూపిఎస్సీ ఎగ్జామ్స్ కు కష్టపడి ప్రిపేరయ్యారు. అయితే మొదటి ప్రయత్నంలో ఆమె విజయం సాధించలేకపోయారు. కానీ పట్టుదల వీడకుండా రెండవ సారి మరింత గట్టి ప్రయత్నంతో విజయం సాధించారు. 2018 కేడర్ లో ఐపీఎస్ గా నియమితులైయ్యారు పూజా యాదవ్. ఒక సారి విఫలమైనా పట్టుదలతో కృషి చేస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ స్వప్నం సాకారం చేసుకోవచ్చని నిరూపించారు పూజా యాదవ్. ఆమె సాధించిన విజయం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.