జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరు లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య బారాముల్లాలోని వనిగమ్ పయాన్ క్రీరీ ప్రాంతంలో గురువారం తెల్లావారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుండి ఏకే 47 రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ లో గడచిన 24 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్. నిన్న తెల్లవారుజామున కుప్వారా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు.
ఇవేళ ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మజీద్ నజర్, హసన్ అహ్మద్ షే గా గుర్తించారు. వీరు ఇద్దరూ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులని పోలీసులు తెలిపారు. వీరు ఈ ఏడాది మార్చిలోనే లష్కరే తోయిబాలో చేరినట్లుగా పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. భద్రతాదళాలు సమర్దవంతంగా ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టాయని అధికారుల పేర్కొన్నారు.
బీజేపీలోకి పొంగులేటి, జూపూల్లి ..? మూహూర్తం ఫిక్స్ అయినట్లే(నా)..!