Elections: గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ కసరత్తు చేస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.
Read More : Modi: మోడీపై నమ్మకం పోతోంది… గుడ్ బై చెప్పేస్తున్న ఆప్తులు
కేంద్రం ఏమంటుందంటే…
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదికలో జమిలి ఎన్నికల గురించి సూచించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘం సహా ఇందులో భాగస్వాములతో చర్చించాలని సూచించిదని ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలు, రోడ్ మ్యాప్ రూపొందించే పనిని లా కమిషన్కి అప్పగించినట్లు స్పష్టం చేశారు. పదే పదే ఎన్నికల నిర్వహణ కారణంగా ఆర్థిక భారం, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందన్నారు.
Read More : BJP: లాలూ ఈజ్ బ్యాక్… బీజేపీకి ఆ రాష్ట్రంలో చుక్కలే
ఖర్చులు ఎలా అంటే…
లోక్సభ ఎన్నికల వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యయాన్ని ఆయా రాష్ట్రాలు భరిస్తున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన వివరణ నేపథ్యంలో జమిలీ ఎన్నికల అంశం తెరమీదకు వచ్చిందని అంటున్నారు.