Jammu and kashmir: జమ్ము విమానాశ్రయంలోని టెక్నికల్ ఏరియాలో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయిదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లు తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. మొదటి పేలుడు ధాటికి భవనం పైకప్పు పాక్షికంగా ధ్వంసం అయినట్లు సమాచారం. రెండవ పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.
ఆ దాడికి రెండు డ్రోన్లను వినియోగించినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. విమానాశ్రయంలోని హై సెక్యురిటీ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నాయి. బాంబు నిర్వర్య బృందాలు, ఫారెన్సిక్ నిపుణులు ఘటన ప్రాంతాలను పరిశీలన జరిపాయి.
ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంటనే స్పందించారు. వైస్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా మరో వైపు నార్వెల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి అయిదు కేజీల ఐఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Jammu and Kashmir: Explosion heard inside Jammu airport's technical area; forensic team reaches the spot
Details awaited pic.twitter.com/duWctZvCNx
— ANI (@ANI) June 27, 2021
Two Indian Air Force (IAF) personnel suffered minor injuries in the drone explosions near the Jammu Air base: Sources
— ANI (@ANI) June 27, 2021