Breaking: జమ్ముకశ్మీరులోని షాపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాద సంస్థ సభ్యుడు హత్యమైయ్యాడు. షాపియాన్ జిల్లాలోని కప్రేన్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
జవాన్ల కాల్పుల్లో ఉగ్రవాది కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్ హతమైనట్లు కశ్మీర్ ఏ డి జీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇవేళ ఉదయం ఎదురు కాల్పులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా కశ్మీరు పోలీసులు భారత సైన్యంతో కలిసి గురువారం నిర్వహించిన ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.