Supreme court : భారత తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. 48వ సీజేగా జస్టిస్ ఎన్ వి రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ బొబ్డే ఈ నెల 23వ తేదీ రిటైర్ అవ్వనున్నారు. ఈ నెల 24వ తేదీన జస్టిస్ ఎన్ వి రమణ భారత సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 26 ఆగస్టు 2022 వరకూ జస్టిస్ రమణ ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పొన్నవరం గ్రామంలో జన్మించిన ఎన్ వి రమణ 1983లో న్యాయవాద వృత్తి మొదలు పెట్టారు. 2000 సంవత్సవరం జూన్ నెలలో ఏపి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. ఆ తరువాత ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ 2014 లో ఫిబ్రవరి లో సుప్రీం కోర్టుకు పదోన్నతి పొందారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?