దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎడు గంటలకు స్ట్రాంగ్ రూమ్ లను ఓపెన్ చేసిన అధికారులు, 8 గంటల నుండి ఎన్నికల కౌటింగ్ మొదలు అయ్యింది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు..ముందుగా ఓట్ ఫ్రమ్ హోమ్, పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు. ఇందులో హోరాహీరీగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 98, బీజేపీకి 86, జేడీఎస్ 17, ఇతరులకు నాలుగు ఓట్లు పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో బళ్లారి సిటీలో గాలి జనార్థన్ రెడ్డి పార్టీ కేఆర్ పీపీ లీడ్ లో ఉంది.
కర్ణాటకలోన 224 నియోజకవర్గాల్లో జరుగుతున్న కౌంటింగ్ పై మధ్యాహ్నం వరకు తుది ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భాగంగా బెంగళూరులో రాత్రి 12 గంటల వరకూ 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఇక గెలుపుపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తానేనంటూ కుమార స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 224 నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు అవసరం. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుండగా, మరో పక్క పెద్ద ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.