కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు కాగా కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో విజయం సాధించగా, మరో 16 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తొంది. బీజేపీ 59 స్థానాలు గెలుపొందగా, మరో ఏడు స్థానాల్లో లీడ్ లో ఉంది. జేడీఎం 17 స్థానాల్లో విజయం సాధించింది. మరో నాలుగు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యతను ఇచ్చారు ఓటర్లు. ఇప్పటికే పార్టీ అధిష్టానం కర్ణాటకలోనే మకాం వేసి అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయన అక్కడే ఉండి ముఖ్య నేతలతో సమావేశమై పరిస్థితిపై చర్చిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కర్ణాటకలో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ అభ్యర్ధులు అధిక్యంలోకి రావడంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, పాత మైసూర్ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ గాలిలో మంత్రులు, ధనవంతులు ఓటమి పాలైయ్యారు. మైనింగ్ కింగ్ గాలి జనార్థనరెడ్డి పార్టీ ఘోర పరాజయం పాలైంది. గాలి జనార్థనరెడ్డి గెలుపొందగా, ఆయన భార్యతో సహా 48 మంది అభ్యర్ధులు ఓటమి పాలైయ్యారు. పాత మైసూర్ ప్రాంతంల కాంగ్రెస్ ప్రధమ స్థానంలో నిలవగా, జేడీఎం రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. పాద హైదరాబాద్ ప్రాంతంలోనూ కాంగ్రెస్ హవా చూపింది.
కాంగ్రెస్ పార్టీ విజయ దుంధుభి మోగించడంతో రాహుల్ గాంధీ కర్ణాటకలో జరిపిన భారత్ జోడో యాత్ర ఈ ఫలితాలు తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ ఎక్కువ రోజులు పాదయాత్ర చేశారు. 25 రోజుల పాటు 500 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. ఇక్కడ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా కలిసి రాహుల్ తో కలిసి నడక సాగించడం కలిసి వచ్చింది. జోడో యాత్రలో ఉన్న సమయంలోనే రాహుల్ గాంధీ నేతలందరినీ ఏకం చేశారు. కర్ణాటకలో రాహుల్ పాదయాత్రకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పంధన లభించినప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనాలు వినిపించాయని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని హెచ్చరించిన సీఎం జగన్