NewsOrbit
జాతీయం న్యూస్

DK Sivakumar: డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు .. పార్టీ అధిష్టానం నుండి పిలుపు

Share

DK Sivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ద రామయ్యలు ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వడంలో తన పాత్ర ఉన్నందున సీఎం పదవి తనకే వరిస్తుందన్న ఆశలో డీకే శివకుమార్ ఉన్నారు. సీనియారిటీ, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, మెజార్టీ ప్రజల మద్దతు ఉండటం వల్ల తనకే సీఎం పదవి వరిస్తుందని సిద్ద రామయ్య భావిస్తున్నారు.

dk Sivakumar

 

అయితే పార్టీ అధిష్టానం నుండి డీకే శివకుమార్ కు పిలుపు రావడంతో ఢిల్లీ బయలుదేరారు. ఇవేళ శివకుమార్ జన్మదినం కావడంతో పార్టీ శ్రేణుల మధ్య పుట్టిన రోజు కేక్ ను కట్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ద రామయ్య సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు శివకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలివేశామని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి విధేయుడినని అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజు అని, తాను కొన్ని పూజలు చేయాలని, నా విశ్వాసం ప్రకారం ఆ పూజలే తనను కాపాడతాయని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేశాననీ, ప్రజలకు తమకు 135 సీట్లు ఇచ్చారని శివకుమార్ అన్నారు. ఇవేళ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి.

సిద్ద రామయ్య వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?


Share

Related posts

Amith Shah: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో షా ఉగ్రరూపం..! పీకే టార్గెట్ గా ఆడియో టేపులు, కన్నింగ్ రాజకీయాలు..!!

Yandamuri

అంతర్మథనంలోనూ పరనిందలేనా?

Siva Prasad

MP RRR letter to CM YS Jagan: రఘురామ లేఖాస్త్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో..? వరుసగా మూడో రోజు సీఎం జగన్ కు లేఖ..!!

somaraju sharma