Kashmir: కశ్మీర్ లో ఉగ్రవాదులకు సంబంధించిన వార్తలు సహజంగానే ఆశ్చర్యపోయేలా ఉంటాయన్నే సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల దగ్గర సాధారణంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉంటాయి. ఏదైనా ఎన్కౌంటర్ జరిగినప్పుడు వారి నుంచి వీటిని స్వాధీనం చేసుకోవటం సహజమే. ఈ మేరకు అలాంటి వార్తలు వస్తుంటాయి. కానీ జుమ్ముకశ్మీర్ లో ఆగస్ట్ 6 న ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read More : Modi: మోడీపై నమ్మకం పోతోంది… గుడ్ బై చెప్పేస్తున్న ఆప్తులు
వయాగ్ర దొరికింది…
ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను మన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రాజౌరి జిల్లా తనమండి లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చనిపోయిన వారిలో ఒకరు పాకిస్తాన్ జాతీయుడని…అక్రమంగా భారత్ లోకి చొరబడ్డారని బలగాలు గుర్తించాయి. అయితే వారి నుంచి అధికారులు వయాగ్ర ట్యాబెట్లు స్వాధీనం చేసుకున్నారు. రైఫిళ్లు, పేలుడు పదార్థాలతో పాటు వయాగ్ర ట్యాబ్లెట్లు కూడా వారి వద్ద ఉన్నాయని అధికారులు చెప్పారు.
Read More : Pakistan: భారత్ సరిహద్దుల్లో పాక్ కొత్త కుట్ర.. 15 ఏళ్ల పిల్లల్ని అలా వాడుకుంటూ…
సరిహద్దుల్లో కుట్రలు…
ఇదిలాఉండగా, భారత్ సరిహద్దుల్లో ఇటీవల పాకిస్థాన్ తన కుట్రలకు పదును పెడుతోంది. అయితే, ఈ దఫా తన ఎత్తుడలకు కొత్త రూపం ఇస్తోందని అంటున్నారు. ఏకంగా చిన్నపిల్లలను వాడుకుంటూ సరిహద్దుల్లో అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. తాజాగా పాకిస్తాన్కు చెందిన ఓ కుర్రాడు తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాను అని పేర్కొంటూ ఏకంగా దేశ సరిహద్దులే దాటేయడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ బార్డర్ దాటి.. భారత్ లోకి ప్రవేశిస్తున్న ఆ అబ్బాయి గమనించిన బీఎస్ఎఫ్ బలగాలు బాలుడిని అడ్డుకొని ఉన్నతాధికారులకు అప్పగించారు. అయితే, ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.