KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మక వైఖరి అనుసరిస్తున్నారా లేకపోతే కావాలనే మౌనం పాటిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ కేంద్ర గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర గెజిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కేంద్రం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది . అయితే, దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నేరుగా స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read More: KCR: కేసీఆర్ నెత్తిన పాలు పోసిన మోడీ
కేంద్రం ఆర్డర్లో ఏముంది?
బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు కలిగి ఉన్న ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్రం తాజా గెజిట్లో పేర్కొంది. కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి రానుంది. అయితే, దీనిపై తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ వైఖరిపై చర్చ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వెల్లడించింది అంతేకాకుండా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో సీఎం కేసీఆర్ చర్చలు కూడా జరుపుతున్నారని వార్తలు వచ్చాయి.
Read More: Modi: తండ్రి కాంగ్రెస్… కొడుకు బీజేపీ… మోడీ వల్లే ఇద్దరు కలిసి సృష్టించిన రికార్డు ఇది
కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదబ్బా?
గెజిట్ ఆదేశాలు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ విచ్చేశారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అయితే, ఇందులో కృష్ణాబోర్డు గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఓ వైపు ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశాల్లో విరుచుకుపడుతుంటే… కేసీఆర్ మాత్రం ఎందుకు స్పందించడం లేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.