Breaking: ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేరళ శాఖకు ఆ రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ కేసును సుమోటాగో తీసుకున్న కేరళ హైకోర్టు సుమోటాగా తీసుకుని విచారణ జరుపుతోంది. రాష్ట్ర పీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ రూ.5 కోట్ల 20 లక్షలు డిపాజిట్ చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ఈ నగదును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
పీఎఫ్ఐ సంస్థలపై కేంద్రం కీలక నిర్ణయం
పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర నేతలను ఏన్ఐఏ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 23న ఆ సంస్థ మద్దతుదాారులు హార్తాళ్ నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆ సంస్థ, మద్దతుదారులు నిర్వహించిన హార్తాళ్ హింసాత్మకంగా మారింది. బస్సులపై రాళ్లు రువ్వారు. నిరసన కారులను అదుపు చేసేందుకు పోలీసులు అదుపు చేసే ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్ల పై హైకోర్టు సీరియస్ అయ్యింది. సుమోటాగా కేసు దర్యాప్తు చేపట్టింది. కేఎస్ఆర్ టీసీకి రూ.5కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు .. రాష్ట్రంలో జరిగిన నష్టానికి గానూ రూ.5కోట్ల 20 లక్షలు డిపాజిట్ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఉగ్ర ముఠాతో సంబంధాలు ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించి ఇటీవల దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు జరిపి వంద మందికిపైగా పీఎఫ్ఐ నేతలు, మద్దతుదారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ సహా అనుబంధ సంస్థలపై నిషేదం విధించడం జరిగింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఖాతాలను నిలిపివేసిన ట్విట్టర్