KCR: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో ముఖ్యభూమికను పోషించాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ కు విపక్ష పార్టీ నేతల నుండి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేయాలని కేసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్ లో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కేసిఆర్ గళం విప్పిన నేపథ్యంలో మాజీ ప్రధాని దేవగౌడ ఇప్పటికే కేసిఆర్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే నేడు కేసిఆర్ కు ఫోన్ చేసి దేశం కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
KCR: భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దాం
“కేసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం, ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్పూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం, మీరు ముంబాయి రండి..మా ఆథిధ్యాన్ని స్వీకరించండి..అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దాం” అని కేసిఆర్ తో ఉద్దవ్ థాకరే అన్నారు. ఉద్దవ్ థాకరే ఆహ్వానం మేరకు ఈ నెల 20న కేసిఆర్ ముంబాయి వెళ్లనున్నారు. ఆ తరువాత మమతా బెనర్జీ ఆహ్వానం మేరకు కేసిఆర్ కోల్కత్తా వెళ్లనున్నారు.
ఇంతకు ముందే తమిళనాడు పర్యటనకు వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యారు కేసిఆర్. దేశంలో రాజకీయ పరిణామాలపై స్టాలిన్ తో చర్చించారు.
Read More: YS Jagan: సినీ నటుడు ఆలీకి నామినేటెడ్ పోస్టు ఖాయం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!ఇదిగో ప్రూఫ్..!!