NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Maharashtra Political Crisis: ‘మహా’ రాజకీయంలో కీలక పరిణామాలు  

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకూ తెరవెనుక ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర బీజేపీ పెద్దలతో చర్చించిన అనంతరం నిన్న రాత్రి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ అయ్యారు. ఆ తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బలపరీక్ష నిరూపణకు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి మెజార్టీ నిరూపించుకోవాలని సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ కోష్యారీ ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. రేపు (గురువారం) 5 గంటల లోపు బలపరీక్షకు డెడ్ లైన్ విధించారు గవర్నర్. బలపరీక్షను రికార్డు చేయాలని ఆదేశించారు. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ఏక్ నాథ్ శిందే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ఉదయానికి గోహతి నుండి ముంబాయికి చేరుకోనున్నారు.

Maharashtra Political Crisis Governor bhagat Singh Key Orders
Maharashtra Political Crisis Governor bhagat Singh Key Orders

Maharashtra Political Crisis: రేపు ముంబాయికి చేరుకుంటాం

గురువారం ఉదయానికి తమ మద్దతు ఎమ్మెల్యేలతో ముంబాయికి చేరుకుంటామని ప్రకటించారు ఏక్ నాథ్ శిందే. వారం రోజుల తర్వాత శిందే వర్గంలోని ఎమ్మెల్యేలు గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ నుండి బయటకు వచ్చారు. ఏక్ నాథ్ శిందే తో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు గోహతిలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శిందే మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు సంతోషం కోసం ప్రార్ధించామని చెప్పారు. రేపు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో పాల్గొంటామని తెలిపారు. బలపరీత్ర తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

Maharashtra Political Crisis: గవర్నర్ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన శివసేన

మరో పక్క బలపరీక్ష కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను శివసేన సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీం కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేశారు. బలపరీక్ష జరగకుండా మథ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని శివసేన పిటిషన్ లో కోరింది. శివసేన తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, శిందే తరపున నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించనున్నారు. సుప్రీం కోర్టులో కేసు ఉండగా బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ బలాబలాలు

శివసేన 16, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44, ఇతరులు 12, బీజేపీ కూటమి 113, శిండే వర్గం 49గా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సంఖ్య 144.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk