Corona: కరోనా కలకలం మళ్లీ మహారాష్ట్ర తెరమీదకు వచ్చింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ రకం కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నది. తాజాగా అక్కడ మరో 10 మంది కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్ర మళ్లీ డేంజర్ జోన్లోకి వెళుతోందా? అన్న చర్చ జరుగుతోంది.
Read more: corona: దేశంలో కరోనా కలకలం… సాక్షాత్తు రాష్ట్రపతే ఆ మాట చెప్పారు
బయటపడ్డ వారిలో…
ఇవాళ కొత్తగా బయటపడిన 10 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో కలిపి మహారాష్ట్ర లో మొత్తం డెల్టా ప్లస్ కేసుల సంఖ్య 76కు చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం పదిమంది బాధితుల్లో కొల్హాపూర్కు చెందిన వారు ఆరుగురు, రత్నగిరికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. మరో కేసు సింధుదుర్గ్లో బయటపడినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 76 డెల్టా ప్లస్ కేసులలో ఐదుగురు వ్యాధి తీవ్రత ముదరడంతో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.
Read More: Corona: కరోనా డెల్టా ప్లస్ మరణాలు మొదలు… బీ కేర్ ఫుల్
ఇదో గుడ్ న్యూస్…
ఇదిలాఉండగా, దేశంలో కరోనా కేసుల నమోదు విషయంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 417 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. ఇందులో 3,14,924 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,31,342 మంది ప్రాణాలను కోల్పోయారు. టీకా డ్రైవ్లో భాగంగా 54.58కుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.