Breaking: కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో పది మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. హస్సాన్ జిల్లా అర్బికేరె మండలం గాంధీ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున టెంపో ట్రావెలర్ ను ఓ పాల వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జు కాగా తొమ్మిది మంది మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వారు 14 మంది ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదం సంభవించింది. గాంధీనగ్ వద్ద మూడు వాహనాలు ఒకే సారి పరస్పరం ఢీకొన్నాయి. ఓ పాల వ్యాన్, కర్ణాటక ఆర్ టీసీ బస్సు మధ్య లో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జు అయ్యింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.
విశాఖ లో హైటెన్షన్ .. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ నిరసన