Mamata benerji: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోమారు తన సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. ఓవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకొని ప్రధాని మోడీని కలిశారు. నేడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతోనూ దీదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఈ టూర్లో జరిగే పరిణామాలు చర్చకు కారణంగా మారాయి.
Read More : Modi: మోడీ పై విరుచుకుపడే ఏ చాన్స్ వదులుకోని మమత
ఢిల్లీ చేరిన మమత వెంటవెంటనే…
ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ నేత కమల్నాథ్ను కలిశారు. అనంతరం లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని మోడీ నివాసానికి వెళ్లారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధులను విడుదల చేయాలని మమతా కోరినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్లను కూడా అధిక మొత్తంలో రిలీజ్ చేయాలని, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరును మార్చాలన్న పెండింగ్ అంశాన్ని కూడా మోడీతో గుర్తు చేస్తున్నట్లు దీదీ తెలిపారు. దీని గురించి ఆలోచిస్తామని మోడీ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. యశ్ తుఫాన్ సమీక్ష సమయంలో స్వల్ప వ్యవధి పాటు మే నెలలో ఇద్దరూ మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ ఢిల్లీలో తొలిసారి కలుసుకున్నారు.
Read More: Modi: తండ్రి కాంగ్రెస్… కొడుకు బీజేపీ… మోడీ వల్లే ఇద్దరు కలిసి సృష్టించిన రికార్డు ఇది
ఆ విషయంలో పట్టుబట్టిన మమత
పార్లమెంట్లో దుమారం రేపుతున్న పెగాసస్ వ్యవహారంపై అఖిల పక్ష భేటీ నిర్వహించాలని ప్రధాని మోడీని మమతాబెనర్జీ కోరినట్లు సమాచారం. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని దీదీ కోరారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో మమత కమిటీ వేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా జాతీయ రాజకీయాల్లో తను ముఖ్యమైన నేత అని మమత సందేశం ఇస్తున్నారని అంటున్నారు.