Man Chews Snake: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనే దానిపై చాలా మంది సోషల్ మీడియాలో కథనాలు, వీడియోలు చూస్తుంటారు. ఆ వీడియోలను చూసి రకరకాల చాతస్థం పనులు చేస్తుంటారు. గోమూత్రం తాగితే కరోనా రాదని కొందరు అంటుంటే, రోజు ఆవిరి పట్టుకోవాలని కొందరు, ఉదయం, రాత్రి ఫలానా వస్తువులు నీటిలో కలుపుకుని తాగితే రాదని మరి కొందరు ఇలా ఎవరు ఏమి చెబితే అవి చేస్తూ ఉంటున్నారు. శాస్త్రీయత లేని ఎన్నో పనులను చేస్తున్నారు.
ఇదే క్రమంలో తమిళనాడులో ఓ వ్యక్తి ఒళ్లు గగుర్పొడిచే చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చచ్చిపోయిన పామును తింటే కరోనా రాదని ఏవరో చెప్పారంట. అది నమ్మి మధురై జిల్లా పెరుమపట్టి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు వడివేలు (50) చచ్చిపోయిన పామును ఏకంగా నమిలి మింగేశాడు. అంతటితో ఆగకుండా తను పామును తింటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పామును తింటే కరోనా వైరస్ శరీరంలోకి రాదంటూ అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. చచ్చిపోయిన పామును తిన్నందుకు అతనికి అయితే ఏమి కాలేదు కానీ అటవీశాఖ అధికారులు పట్టుకుని ఏడువేల రూపాయల జరిమానా విధించారు.
Read More: DRDO: 2 డీజీ సాచెట్ ధర నిర్ణయించిన రెడ్డీస్ ల్యాబ్స్..
అటవీ శాఖ అధికారుల విచారణలో వడివేలు చెప్పిన విషయాలు చెప్పిన విషయాలు విని అధికారులు షాక్ అయ్యారు. కరోనాను ఎదుర్కోవాలంటే పాములను తినాలని కొందరు తనను బలవంతం చేశారనీ, పామును తిన్న సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పాడు. పామును తినడం వల్ల కరోనా రాదని చెప్పడం తప్పుడు ప్రచారమనీ, ఇలాంటివి నమ్మి ఎవరూ పిచ్చి పనులు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.