రాజస్థాన్ లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం కూలిపోయింది. ఇళ్ల మధ్య లో మిగ్ 21 విమానం కుప్పకూలడంతో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మృతి చెందారు. హనుమాన్ఘర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ మాత్రం పారాచూట్ సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
సురత్ గఢ్ ఎయిర్ బేస్ నుండి ఈ యుద్ద విమానం బయలుదేరిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. రోజు వారి శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం కూలిపోయినట్లు వారు వెల్లడించారు. అయితే ప్రాణనష్టాన్ని తప్పించేందుకు పైలట్ యుద్ద విమానాన్ని నిర్మానుష్య ప్రాంతంలో కూల్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించిన కారణాలపై దర్యాప్తు జరిపేందుకు ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ఇళ్ల మధ్యలో విమానం కూలడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుండి బయటకు ప్రజలు బయటకు పరుగులు తీశారు.
టెక్సాస్ కాల్పుల్లో తెలుగు అమ్మాయి దుర్మరణం