NewsOrbit
జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Modi: మోడీ లాగే కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు!

Modi: దేశంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్ర‌స్తుతం క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్‌ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్కు నిరసనకు దిగారు. ఏఐసీసీ పిలుపుతో జ‌రిగిన ధ‌ర్నాలో పలువురు పార్టీ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, దీనికి కొన‌సాగింపుగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై సైతం ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Read More: KCR: మోడీపై ఎందుకు ఈ మౌనం కేసీఆర్ సాబ్‌?

కాంగ్రెస్ ఏమంటుందంటే..
దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని టీపీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ ఆరోపించారు. ప్రశ్నిస్తే 124ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంలో ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎవరు కొనుగోలు చేశారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నిఘా విభాగం కూడా తమ ఫోన్లను ట్యాప్‌ చేసిందని రాజనర్సింహ ఆరోపించారు. మల్లన్న సాగర్ ముట్టడికి యత్నించినప్పటినుంచి మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఫోన్‌ హ్యాకింగ్‌ మన దేశం చేస్తోందా? శత్రుదేశం చేస్తోందా? అని ప్రశ్నించారు. ఐటీ, ప్రైవసీ చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Read More : KCR: హుజురాబాద్‌లో కేసీఆర్ స్కెచ్ పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్షాల నోరు మూయించేందుకే…

ప్రతిపక్షాల నోరు మూసేందుకే వారిపై నిఘా పెట్టిందని ఈ సంద‌ర్భంగా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఎలక్షన్ కమిషనర్ ఫోన్ ట్యాప్ కి గురికావడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ తోపాటు తన దగ్గర పని చేసేవారిపై కూడా నిఘా కేంద్రం పెట్టిందన్నారు. బ్రిటిష్ వారికంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ విష‌యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారించడంతోపాటు , సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం కూలిపోతుందనే భయం మోడీకి పట్టుకుందన్నారు. దైర్యం ఉన్నవాళ్ళెవరూ ఇలాంటి పనులు చేయలేరన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు.

author avatar
sridhar

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?