Padma Awards: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ వివిధ అంశాలల్లో గత పాలనలకు భిన్నంగా తన మార్క్ కనబడే విధంగా చేస్తుంటారు అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా పద్మ అవార్డుల ఎంపిక విషయంలోనూ మోడీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవ, కృషి చేసిన వారి పేర్లను సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు కేంద్రానికి సిఫార్సు చేస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన పేర్లను కేంద్రం స్క్రూటినీ చేసి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంటుంది.
Read more: Katti Mahesh: కత్తి మహేష్ నోట శ్రీరాముడి భక్తిగీతం..వీడియో వైరల్
అయితే ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. పద్మ అవార్డుల కోసం మంచి పనులు చేసిన వారి పేర్లను పంపాలంటూ ప్రజలకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. “మారుమూల ప్రాంతాల్లో వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి సిఫార్సు చేయాలని కోరారు. భారత్ లో ప్రతిభ గలవారు అనేక మంది ఉన్నారు. వారంతా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్నారు కానీ వారి గురించి మనం పెద్దగా పట్టించుకోం. అలాంటి వారు మీకు తెలుసా.. వారిని మీరు పద్మ అవార్డులకు నామినేట్ చేయొచ్చు. నామినేషన్ లు పంపేందుకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఉంది” అని మోడీ ట్వట్ చేశారు. పీపుల్స్ పద్మ అంటూ హాష్ ట్యాగ్ తో పేర్లను నామినేట్ చేయాల్సిన వెబ్ సైట్ ను మోడీ పేర్కొన్నారు. ఎవరికైనా ఎవరైనా తెలిసుంటే Padmaawards.gov.in లో నామినేట్ చేయవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల్లో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న సామాన్యులను సైతం కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ పద్మ అవార్డులకు నామినేషన్లు పంపాలని వివిధ శాఖలతో పాటు సంస్థలు, ప్రముఖులను కోరింది. ప్రధానంగా సామాజికంగా వెనుకబడిన తరగతులు, దివ్యాంగులు, మహిళ్లో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వారిని గుర్తించాలని సూచించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?