Modi: ఓ వైపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సలహాదారు అమర్జీత్ సిన్హా తన పదవికి రాజీనామా చేసేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ప్రధాని కార్యాలయంలోని కీలక అధికారులు రాజీనామ చేయడం ఇది మూడోసారి. ఇంతకుముందున్న ఇద్దరు ముఖ్య అధికారులు సైతం ఇదేరీతిలో పదవులు వదిలి పెట్టారు. దీంతో పీఎంఓలో ఏం జరుగుతోందన్న చర్చ తెరమీదకు వస్తోంది.
Read More : Modi: మోడీ బ్యాడ్ టైం కాకపోతే.. ఇలా నవ్వుల పాలు అవడం ఏంటి!
ఆయన ఎవరంటే..
1983 బ్యాచ్ బిహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అమర్జీత్ 2019 వరకు పట్టణ అభివృద్ధి కార్యదర్శిగా భారత ప్రభుత్వంలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో ప్రధాని మోడీకి సలహాదారుగా నియామకమయ్యారు. అప్పట్నుంచీ సామాజిక రంగ పథకాలు, పాలసీలకు సంబంధించిన అంశాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. సిన్హా పదవీకాలం ముగియడానికి మరో ఏడు నెలలు ఉంది. అయితేతే, ఆయన ముందుగానే రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. పదవి నుంచి సిన్హా వైదొలగిన వెంటనే పీఎంవో అధికారిక వెబ్సైట్లోని ప్రత్యేక సలహాదారుల పేర్ల జాబితా నుంచి ఆయన పేరును అధికారులు తొలగించారు. ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారి భాస్కర్ ఖుల్బే పేరు మాత్రమే లిస్టులో కనిపిస్తున్నది.
Read More: BJP: పెగాసస్… బీజేపీ సర్కారు బుక్కయిపోతున్నట్లేగా!
ఇప్పటికే ఇద్దరు….
ఇదిలాఉండగా, ఇప్పటికే ఇద్దరు సలహాదారులు పీఎంఓ నుంచి వైదొలిగారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ న్రిపేంద్ర మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైసర్ పీకే సిన్హా సైతం తమ పదవులకు గుడ్ బై చెప్పేశారు. ఈ ఒరవడిలోనే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సలహాదారు అమర్జీత్ సిన్హా పదవికి టాటా చెప్పేయడం చూస్తుంటే మోడీపై ఆయన ఆప్తులకే నమ్మకం పోతోందా? అన్న చర్చ తెరమీదకు వస్తోంది.