Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని టార్గెట్ చేసే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ చాన్స్ వదులుకోని మమత పెగాసస్ స్పైవేర్తో అనేక మంది నేతలపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెగాసస్ స్పైవేర్ నిఘా నుంచి తప్పించుకోవడం కోసం తన మొబైల్ ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేసేశానని, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయవలసి ఉందని చెప్పారు.
Read More : Modi: తండ్రి కాంగ్రెస్… కొడుకు బీజేపీ… మోడీ వల్లే ఇద్దరు కలిసి సృష్టించిన రికార్డు ఇది
మమత ఏమంటున్నారంటే…
అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వర్చువల్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో మమత బెనర్జీ ప్రసంగించారు. పెగాసస్ చాలా ప్రమాదకరం. వాళ్లు వ్యక్తులను హింసిస్తున్నారు. కొన్నిసార్లు నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఢిల్లీ లేదా ఒడిశా చీఫ్ మినిస్టర్లతో మాట్లాడలేకపోతున్నానని ఆమె అన్నారు. దేశంలో స్పైగిరి జరుగుతోందని, మంత్రులు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ల హ్యాకింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని ఆమె కోరారు.
Read More : BJP: బీజేపీ ఆ విషయంలో కేసీఆర్ను వదిలిపెట్టట్లేదుగా!
ప్రమాదంలో ప్రజాస్వామ్యం…
ఎన్నికల ప్రక్రియ, న్యాయ వ్యవస్థ, మంత్రులు, మీడియా హౌస్లను పెగాసస్ ఆక్రమించుకుందని మమత బెనర్జీ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి బదులుగా నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. దేశాన్ని ఓ నిఘా కేంద్రంగా చేయాలనుకుంటున్నారా అంటూ మమత ప్రశ్నించారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, దీనికి బీజేపీయే కారణమన్నారు. వాళ్లు తమ మంత్రులనే విశ్వసించడం లేదు. వాళ్లు అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని మమత విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.