mamata benerji: ఊహించిందే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిమ్మతిరిగిపోయే షాకిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీకి తిరిగి మళ్లీ అదే రాష్ట్రంలో ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పార్టీని వీడి తిరిగి సొంత గూడు అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో షాక్ తినడం బీజేపీ వంతు అయింది.
Read More: Modi: మోడీ కి పెద్ద రిలీఫ్… కరోనా సెకండ్ వేవ్ కష్టాలు తేలేదట
రాయ్ చరిత్ర పెద్దదే..
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ముకుల్.. పార్టీ ప్రారంభం నుంచి కీలకంగా పనిచేశారు. అయితే 2017లో మమతాతో రాజకీయపరమైన విబేధాలు రావడంతో బీజేపీ వైపు చూశారు. పార్టీ అనుమతి లేకుండా బీజేపీ ముఖ్యనాయకులను కలిసి తృణమూల్ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. టీఎంసీకి చెందిన పలువురు కీలక నేతలు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరగా అందులో మొట్ట మొదటి వ్యక్తి ముకుల్ రాయ్. బీజేపీలో చేరిన ముకుల్.. ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ముకుల్ విస్తృతంగా పనిచేశారు. కానీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయింది.
Read More: Modi: రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ఎప్పుడు ఉపసంహరించుకుంటారంటే…
ఒత్తిడి తట్టుకోలేకే..
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి పార్టీ మారాలంటూ టీఎంసీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగినట్లు ముకుల్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇటీవలే మమతా బెనర్జీ మేనల్లుడు సైతం ముకుల్ రాయ్ ను తిరిగి పార్టీలోకి రావాలని కోరారు.ఈ క్రమంలోనే తిరిగి సొంతగూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ చేరారు. ముకుల్తో పాటు ఆయన కుమారుడు సుబ్రాన్షు కూడా టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?