Modi దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు రోజురోజుకీ పెరుగుతూ వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.90గా ఉంది. తమ జేబులకు భారీగా చిల్లులు పడుతుండటంతో దీనిపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఇదే సమయంలో కేంద్రం ఇంకో షాక్ సిద్ధం చేస్తోంది. బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తొలుత నాలుగు మధ్య శ్రేణి బ్యాంకులను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిందని సమాచారం.
ఏంటిది మోడీ Modi జీ?
వేలాది ఉద్యోగులను కలిగి ఉన్న రాష్ట్ర స్థాయి బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం రిస్క్ అని మోడీ సర్కార్ అనుకుంటోదని సమాచారం. అయితే ముందుగా వివిధ బ్యాంకులతో దీన్ని అమలు చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను త్వరలోనే ప్రైవేట్ బ్యాంకులుగా మారుస్తుందని సమాచారం.
భగ్గుమంటున్న జనం…. లైట్ తీసుకుంటున్న కేంద్రం
పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతుండటంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుని తమకు అనంగులైన ఇద్దరికి దోచి పెడుతున్నారని కేంద్రాన్ని రాహుల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే కేంద్రం ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోందని ఫైర్ అయ్యారు. ఇది చాలా బాధాకరమన్నారు. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోట్లాది మంది తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు సాయం కోసం అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు మౌనం వహిస్తోంది’ అని మాయావతి విమర్శించారు. మరోవైపు పెట్రోల్ రేట్ల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ షాక్ అయ్యే క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పెట్రో రేట్లు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్ మీద పన్నులు తగ్గించే ప్రపోజల్స్ కేంద్రానికి లేవని రాజ్యసభలో ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు.