Modi: కేంద్రం ప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాల విషయంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా శనివారం సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ క్రాంతి దివస్ నిర్వహించింది. ఈ చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్సులను జారీ చేసి, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ చట్టాల కాపీలు దగ్ధం చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా రైతు సంఘాట నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More : Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్రకటించారో తెలుసా?
కేంద్ర చట్టాలు ఎప్పుడు ఉపసంహరించుకుంటారంటే…
మూడు వ్యవసాయ చట్టాలను 2024లోపు కేంద్రం ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని రైతునేత రాకేశ్ టికాయత్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై, రైతుల ఆందోళనపై ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”2024 నాటికి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటుంది. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పటికి దేశంలో ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ఈ వ్యవసాయ చట్టాలు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డిఎ)కు పెద్ద ఆటంకిగా మారాయి. వీటిని కొనసాగిస్తే వారికి చాలా నష్టం” అని అన్నారు. ”వాళ్లు ఎందుకు ఉపసంహరించుకోరు? అలా అనుకోవడానికి బలమైన కారణం ఏదైనా ఉందా? సెప్టెంబర్లో చట్టంగా మారి ఇప్పటికీ అమలు కాలేదు. ఇంకో ఏడాది పాటు కూడా అమలు చేయమని చెప్పారు. ఇక ఎప్పటికీ అమలు కాదు” అని అన్నారు.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
బీజేపీ నేతలకు షాక్…
భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) మీడియా ఇన్ఛార్జి ధర్మేంద్ర మాలిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల నకళ్లను దేశవ్యాప్తంగా బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద తగులబెట్టనున్నట్లు తెలిపారు. బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు లేని జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద తమ నిరసనను తెలియజేస్తామన్నారు.