Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే ఉజ్వల పథకం 2.0ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన మోడీ ఈ పథకం ద్వారా కోటి మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ ఈ పథకం ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
Read More : Modi: మోడీపై నమ్మకం పోతోంది… గుడ్ బై చెప్పేస్తున్న ఆప్తులు
ఇది స్కీం లెక్క…
ఉజ్వల స్కీమ్ను 2016లో ప్రారంభించగా.. ఆ సమయంలో ఐదు కోట్ల బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు లక్ష్యంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 2021 -22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద అదనంగా కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. తొలి దశలో 1,47,43,862 ఎల్పీజీ కనెక్షన్లను పేద కుటుంబాలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో అందని వారికి రెండో దశలో కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Read More: Modi: మోడీ లాగే కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు!
మోడీ జీ ఏమంటున్నారంటే…
ఈ దఫాలో గ్యాస్ కనెక్షన్ తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోటిమంది తక్కువ ఆదాయం గల వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకే ఉజ్వల 2.0 పథకం ప్రారంభించామని మోడీ తెలిపారు. 2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 2019 ఆగస్టు నాటికి ఐదు కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకున్నదని ప్రధాని మోడి అన్నారు. ఎలాంటి చిరునామా ధృవీకరణ లేకపోయినా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది.