Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
Read More: Modi: మోడీ బ్యాడ్ టైం కాకపోతే.. ఇలా నవ్వుల పాలు అవడం ఏంటి!
రూ.2 లక్షల కోట్లు..
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారని కితాబు ఇచ్చారు. వైద్య సదుపాయాలను దేశంలో మెరుగుపరిచామని ప్రధాని మోడీ తెలిపారు. రూ.2 లక్షల కోట్ల రూపాయల నిధులు వైద్యరంగం కోసం కేటాయిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, ప్రధాని ప్రకటన వైద్య రంగంలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
Read More: Corona: గుడ్ న్యూస్ఃమనకు కరోనా ముప్పు తక్కువే!
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం…
కరోనా వైరస్ కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. బాధితుల కుటుంబాలకు కనీసం ఉపశమనం కలిగించే విధంగా ఆరు వారాల్లో మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ధకు నోటీసులు పంపింది. జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో తాము న్యాయ సమీక్ష యొక్క పరిధిని చర్చించామని సుప్రీం తెలిపింది. ప్రభుత్వం తన స్వంత ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలని చెప్పింది. “వలస కూలీలకు ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావాలను ఎదుర్కోవడంపైన దృష్టి సారించాలి. ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించమని కేంద్రాన్ని ఆదేశించలేం. ఎంత మొత్తం అనేది ప్రభుత్వం పరిష్కరించాలి. అంతిమంగా ప్రాధాన్యతలను కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలన్న నిర్ణయం జాతీయ సంస్థకు ఇస్తున్నాం. ఇందుకోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ కింద నిధుల లభ్యతను పరిగణలోకి తీసుకోవాలని” చెప్పింది.