Taliban: ఆప్ఘనిస్తాన్ ను అల్లకల్లోలం చేసిన తాలిబాన్ల విషయంలో సమాజ్వాదీ పార్టీ సంబల్ ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఏకంగా తాలిబన్ల పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంతో పోల్చాడు. తన దృష్టిలో ఈ రెండు పోరాటాలు ఒకటేనంటూ కామెంట్స్ చేశాడు. తాలిబన్లది ఫ్రీడం ఫైట్ అంటూ అభివర్ణించాడు.
Read More: afghanistan: ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా మళ్లీ ఘనీ… అసలు ట్విస్ట్ ఏంటంటే..
తాలిబాన్లకు మద్దతు…
తాలిబాన్లకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా.. వారిని ఇండియన్ ఫ్రీడం ఫైటర్స్ తో పోల్చిన ఎస్పీ ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. సంబల్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబాన్లను సమర్థిస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు ఆయనదేశద్రోహం కేసు నమోదైంది. ఆగస్ట్ 16న ఎంపీ చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు రాజేష్ సింఘాల్, ఓంవీర్ ఖద్వంశీల ఫిర్యాదుపై యూపీ పోలీసులు ఆయనపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read More: Pakistan: ఒక్క మహిళపై 300 మంది దాడి… బట్టలు చించి..పాకిస్తాన్ ఏం జరిగిందంటే…
మాటలను వక్రీకరించారు
తాలిబాన్లను తాను ఇండియన్ ఫ్రీడం ఫైటర్స్ తో పోల్చలేదని, తన ప్రకటనను వక్రీకరించారని ఎస్పీ ఎంపీ షఫీక్ ఉర్ వివరణ ఇచ్చారు. ఆప్ఘన్లో ఏం జరుగుతుందో తనకు అనవసరమని, తాను భారత ప్రభుత్వ విధానాలను సమర్ధిస్తానని తాజాగా చెప్పుకువచ్చారు. అదంతా అఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారమని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?