Baba Ramdev: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఐఎంఎ ఆగ్రహాని గురవుతున్న సంగతి తెలిసిందే. అల్లోపతి వైద్యంపై, ఆ వైద్యులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పినా వారు శాంతించినట్లు లేరు.
తాజాగా రాందేవ్ బాబాకు రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రాజస్థానం రాష్ట్రం అల్వర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం స్థానికంగా ఉండే సింఘానియా ఆయిల్ మిల్లును సీజ్ చేసింది. ఈ మిల్లులో భారీ ఎత్తున కల్తీ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ తనిఖీల్లో బాబా రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆవ నూనె సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దర్యాప్తు నిమిత్తం అక్కడ ఉన్న ఆవ నూనె సాంపిల్స్ సేకరించారు.
Read More: Toll Fees: వాహనదారులకు గుడ్ న్యూస్ ..! ఇలా ఉంటే టోల్ రుసుము కట్టాల్సిన పని లేదంట..!!
యోగా గురువు రాందేవ్ కు చెందిన పతంజలి ప్రొడక్ట్ అయిన అవనూనె తయారీలో కల్తీ జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు అల్వర్ సబ్ డివిజన్ అధికారి యోగేష్ ఠాగూర్ మీడియాకు వివరించారు.
రాజకీయాలకు దూరమని చెబుతూనే రాందేవ్ బాబా గతంలో చాలా సార్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో మోడీని ప్రధాన మంత్రిగా చేయాలంటూ క్రియాశీలకంగా ప్రచారం కూడా చేశారు. అయితే 2019 ఎన్నికల సమయంలో కొంత దూరంగా ఉండిపోయారు. నాటి ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా జోస్యం చెప్పలేనని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ యుద్ధం జరుగుతోందనీ, పరిస్థితి అస్పస్టంగా ఉందని, రాజకీయ సంగ్రామంలో ఎవరు గెలుస్తారో చెప్పలేమని వ్యాఖ్యానించారు రాందేవ్. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రెండవ సారి ప్రధాన మంత్రిగా మోడీ రెండవ సారి ప్రధాన మంత్రి అయిన తరువాత బీజేపీ రాందేవ్ ను దూరం పెట్టిందన్న టాక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ రాందేవ్ బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారని సమాచారం.