కేరళలోని కొల్లాం జిల్లాలో నీట్ పరీక్ష సందర్భంగా బాలికలకు జరిగిన అవమాన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసిన విద్యార్ధినులందరికీ మరో సారి పరీక్షకు నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చింది. విషయంలోకి వెళితే.. నీట్ పరీక్షల నిర్వహణ సందర్భంగా కొల్లాం జిల్లాలోని చాతమంగళం పరీక్షా కేంద్రం వద్ద బాలికలను లోదుస్తులు తీసేసి లోపలకి వెళ్లాలని ఆదేశించడంతో బాలికలు తీవ్ర అసహానికి గురైయ్యారు. అవమానికి గురైన బాలికలు సరిగ్గా పరీక్ష రాయలేకపోయారన్న వాదనలు బయటకు వచ్చాయి. ఓ విద్యార్ధిని తండ్రి ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు బ్రాలు తీసి వెళ్లాలంటూ తన కుమార్తె సహా మహిళా విద్యార్ధిలను ఆదేశించారని ఆ బాలిక తండ్రి కొట్టకర పోలీసులకు గత ఏడాది జూలై లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరీక్ష జరిపిన కళాశాల సిబ్బంది ఇద్దరు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ చర్యలకు ఆదేశాలు ఇచ్చాయి. ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఏర్పాటు చేసింది. కమిటీ జరిపిన విచారణలోనూ విద్యార్ధినులు ఆరోపించిన విధంగా సిబ్బంది ప్రవర్తించారని తెలిసింది.
వాస్తవానికి పరీక్షలకు హజరయ్యే విద్యార్ధినులు లోదుస్తులు తొలగించి పరీక్షలు రాయాలన్న నిబంధన ఏమీ లేదు. కానీ సిబ్బంది ఆ విధంగా ప్రవర్తించడంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నాడు లోదుస్తులు విప్పించడం వల్ల పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులందరికీ మరో సారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 4వ తేదీన వారికి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
మునావర్ షారుఖీకి ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్