Corona virus Variants: కరోనా మహామ్మారి ఇప్పట్లో వదిలేలా కనబడటం లేదు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ ఉందంటూ శాస్త్రవేత్తల హెచ్చరికలు వస్తున్నాయి. దీనికి తోడు కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు దాన్ని రూపాన్ని మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇండియాలో మరో ప్రమాదకరమైన కరోనా వేరియంట్ ను గుర్తించారు. ఇంతకు ముందు ఈ వేరియంట్ ను బ్రెజిల్ లో గుర్తించారు. కరోనా వైరస్ కు చెందిన రెండు కొత్త వేరియంట్లు ఇటీవల బ్రెజిల్ నుండి భారతదేశంలోకి ప్రవేశించాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. భారత్ లో కనిపించిన ఈ కొత్త వేరియంట్ పేరు బి.1.1,28.2. శాస్త్రవేత్తల ఈ వేరియంట్ ను ఎలుకలపై పరీక్షలు జరపగా ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read More: YS Jagan Delhi Tour: ఢిల్లీకి జగన్.. లేఖల ప్రభావమా..!? రఘురామ ప్రభావమా..!?
ఈ కొత్త వేరియంట్ సోకితే…వారం రోజుల్లోనే దాన్ని గుర్తించవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. ఈ వేరియంట్ బారిన పడిన వారు వారం రోజుల్లోనే తమ బరువును చాలా అధికంగా కోల్పోతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలో యాంటీ బాడీల సామర్థ్యాన్ని ఈ వేరియంట్ తగ్గిస్తుందట. ఈ కొత్త రకం వేరియంట్ పై పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త స్పందించారు. విదేశాల నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ వేరియంట్ వైరస్ కేసులు ఎక్కువగా లేవని తెలిపారు.
కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో లక్షా 14వేల కేసులు నమోదు అయ్యాయి. గత నెలలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా గడచిన వారం రోజులుగా సరాసరి లక్షా 20వేల లోపు మాత్రమే నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.