Nirav Modi: పెద్ద మొత్తంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్ ను బ్రిటన్ హోంమంత్రి పూర్తి చేసి ప్రభుత్వానికి పంపినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
లండన్ కోర్టులో కొద్ది రోజుల క్రితమే నీరవ్ మోడికి చుక్కెదురైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (సీఎన్ బీ)కి దాదాపు 14వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవడంతో ఆయనపై నమోదైన మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొన్నది. లండన్ కోర్టు ఫిబ్రవరి 25న నీరవ్ మోడిని విచారించేందుకు భారత్ కు అప్పగించాలని తీర్పు ఇచ్చింది.