Nityananda Swamy: దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు నిత్యానంద స్వామి, రాసలీలల వ్యవహారంలో అడ్డంగా బుక్ అయి దేశం విడిచి పారిపోయిన నకిలీ స్వామిజీ నిత్యానంద. ఈయన లీలలు అందరినీ ఆశ్చర్యాన్ని కల్గిస్తుంటాయి. గతంలో చాలా మంది నకిలీ బాబాలు, స్వామిజీలు భక్తులను మోసం చేసి కేసులు ఎదుర్కొన్న వారు తరువాత ఎక్కడ ఉన్నారో తెలియని విధంగా రహస్య జీవితాలను గడుపుతున్నారు. అయితే ఈ నిత్యానంద స్వామి మాత్రం సంచలన చేష్టలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
సినీ నటి రంజితతో రాసలీలల వీడియో బహిర్గతం అయిన తరువాత పలువురు మహిళలు నిత్యానందపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఆయన బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత దేశం విడిచి పారిపోయారు. ఆ తరువాత కొన్ని నెలలకు దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్విడార్ దేశం పక్కన ఉన్న సముద్రంలోని ఓ దీవిని కొనుగోలు చేసి అక్కడ ఏకంగా కైలాస అనే దేశాన్ని ఆయనే రాజుగా స్థాపించినట్లుగా, ప్రత్యేకంగా కరెన్సీ ఏర్పాటు చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
దానికి తోడు తాను ఏర్పాటు చేసిన దేశానికి గుర్తింపు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితికి అప్పీల్ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆ ఘటనలే వీస్తూపోయేలా ఉఁటే ఇప్పుడు తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి గెటప్ లో నిత్యానంద స్వామి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం శ్రీ వారి భక్తులను ఆగ్రహం కల్గిస్తోంది. ఇంతకు ముందు శివుడి గెటప్ లో, దేశానికి రాజుగా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిత్యానందా ఏమిటీ చేష్టలు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.