రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంలో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రఫేల్ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయనీ, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించి, విచారణకు నిరాకరించింది.
జాలర్ల పంట పండిస్తున్న పులస .. ఈ ఏడాది పులస చేప ధర ఎంత పలికింది అంటే..?
తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిటిషన్ దాఖలు చేయలేదనీ, అవినీతి వ్యవహారాలను కోర్టు దృష్టికి తీసుకురావడమే తన లక్ష్యమని ఎఎల్ శర్మ కోర్టుకు తెలిపారు. రఫేల్ ఒప్పందంలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒప్పందంలో భాగంగా ఒక మిలియన్ యూరోలు మధ్యవర్తులకు ఇచ్చిన్నట్లు ఫ్రెంచ్ దర్యాప్తు సంస్థ కూడా చెప్పిందని పిటిషన్ సర్వోన్నత ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అక్కడి మీడియా అనేక కథనాలు కూడా రాసిందని పేర్కొన్నారు. శర్మ వాదనల అనంతరం పిటిషన్ ను వెనక్కు తీసుకుంటారా లేక డిస్మిస్ చేయమంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటానని శర్మ సమాధానమిచ్చారు. ఇదే వ్యవహారంపై గతంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిందనీ, అదే విషయాన్ని పదేపదే లేవనెత్తితే విచారణ జరపడం సాధ్యం కాదని సీజే జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏపిలో వినాయక చవితి వేడుకల నిర్వహణకు డీజీపీ ఇచ్చిన క్లారిటీ ఇది