Owaisi: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన రియాక్షన్ ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఎప్పుడూ బీజేపీ అంటే ఉప్పు – నిప్పులా ఉండే ఒవైసీ ట్విట్టర్లో ఊహించని చర్చుకు కేంద్రంగా మారారు. ప్రధానమంత్రి చేసిన ఓ ట్వీట్కు ‘వెరీ గుడ్ సర్’ అంటూ దలైలామా ప్రశంసించారు.
Read More: Owaisi: అక్కడ అసదుద్దీన్ ఓవైసీ మ్యాజిక్ చేస్తారా?
మోడీ చేసిన పనికి…
టిబెటన్ బౌద్ధ గురు దలైలామా 86 పుట్టినరోజు నేడు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. లామాను ఫోన్ ద్వారా విష్ చేసిన మోడీ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ ఈ ఏడాది దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్టు ప్రకటించడంతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ‘‘వెరీ గుడ్ సర్”అంటూ ట్వీట్ చేశారు. అయితే మోడీ నేరుగా వెళ్లి లామాను కలిసి విష్ చేసి ఉంటే చైనాకు గట్టి మెసేజ్ ఇచ్చినట్టు ఉండేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు.
Read More: Narendra Modi: మోడీ కొత్త టీం ఇదే… ఎవరెవరికి చాన్స్ అంటే
అసలేం జరిగిందంటే…
టిబెట్ను చైనా ఆక్రమించిన నేపథ్యంలో 1959లో దలైలామా అనేక మంది టిబెటన్ పౌరులు, బౌద్ధ సన్యాసులతో కలిసి భారత్ కు వచ్చారు. నాటి నుంచి ఆయన హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో నివసిస్తూ టిబెట్కు ప్రవాస పాలకుడిగా ఉంటున్నారు. అయితే లామా పాలనను చైనా అంగీకరించడం లేదు. ఆయనకు ఇండియా ఆశ్రయం ఇవ్వడంపైనా చైనా గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని 2018లో రెండు దేశాలూ ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాది నుంచి ప్రధాని మోడీ ఎప్పుడూ దలైలామాను కలవడం గానీ, బహిరంగంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు లాంటి చెప్పడం గానీ చేయలేదు. అయితే, తాజాగా ఆయనకు ప్రధాని శుభాకాంక్షలు తెలపడం పట్ల ఓవైసీ సంతోషం వ్యక్తం చేశారు.