Owaisi: హైదరాబాద్ ఎంపీ, అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రథసారథి అసదుద్దీన్ ఓవైసీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీకి ప్రతిష్టాత్మక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి షాకిచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, దీనికి ఓవైసీ తన ప్లానుల్లో తాను ఉంటే మరోవైపు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ప్రచారాన్ని ఓవైసీ ఖండించారు.
Read More: owaisi: షాక్ఃమోడీని మెచ్చుకున్న ఓవైసీ
ఇది జరిగింది…
ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఏఐఎంఐఎం ఆహ్వానించింది. దరఖాస్తు నిర్దేశిత రూపంలో, విశ్వసనీయ ఒప్పందాన్ని కలిగి ఉంటుందంది. ఒకవేళ టికెట్ లభించకపోయినా పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ, ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉంటుందని పార్టీ పేర్కొన్న ‘లాయల్టీ కాంట్రాక్ట్’ లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు రూ .10 వేలు దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఏఐఎంఐఎం స్టేట్ ప్రెసిటెండ్ షౌకత్ అలీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లోని 100 ముస్లిం మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా భావసారుప్యత గల పార్టీలతో పొత్తుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు చెప్పారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఎస్పీ, బీఎస్పీ ఇరు పార్టీల తలుపులు తమకోసం తెరిచే ఉన్నాయన్నారు.
Read More : Modi: తండ్రి కాంగ్రెస్… కొడుకు బీజేపీ… మోడీ వల్లే ఇద్దరు కలిసి సృష్టించిన రికార్డు ఇది
ఆ ప్రచారంపై ఓవైసీ స్పందన
రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు వార్తలను యూపీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. యూపీలో ఒకవేళ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేస్తే పొత్తుకు తాము ఓకే అన్న వార్తలను ఆయన ఖండించారు. తాను గానీ తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గానీ ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ 20 శాతం ముస్లిం ఓట్లను పొందింది. అయినప్పటికీ ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా చేయలేదన్నారు. కాగా, ప్రధాన పార్టీల విషయంలో ఓవైసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్తున్నారు.