Pakistan: భారత్ సరిహద్దుల్లో మరోమారు పాకిస్థాన్ తన కుట్రలకు పదును పెడుతోంది. అయితే, ఈ దఫా తన ఎత్తుడలకు కొత్త రూపం ఇస్తోందని అంటున్నారు. ఏకంగా చిన్నపిల్లలను వాడుకుంటూ సరిహద్దుల్లో అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. తాజాగా పాకిస్తాన్కు చెందిన ఓ కుర్రాడు తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాను అని పేర్కొంటూ ఏకంగా దేశ సరిహద్దులే దాటేయడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ బార్డర్ దాటి.. భారత్ లోకి ప్రవేశిస్తున్న ఆ అబ్బాయిన గమనించిన బీఎస్ఎఫ్ బలగాలు బాలుడిని అడ్డుకొని ఉన్నతాధికారులకు అప్పగించారు. అయితే, ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read More: Pakistan: పాక్ బుద్ది మారే చాన్సేలేదా … కొంప కాలిపోతున్నా అదే మాట
అసలేం జరిగిందంటే…
ఇంట్లో అమ్మానాన్నలతో గొడవ పడిన 15 ఏళ్ల బాలుడు మన బార్డర్ ద్వారా భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ఖవ్డా గ్రామంలోని భారత్ – పాక్ సరిహద్దుల్లోని పిల్లర్ నెంబర్ 1099 వద్ద భారత్ లోకి ప్రవేశించేందుకు ప్లాన్ వేశాడు. ఫెన్సింగ్ దాటుతున్న బాలుడిని గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో బాలుడు ఇంట్లోంచి గొడవపడి బయటకు వచ్చాడని తెలుసుకొని ఖవ్డా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కలకలం రేకెత్తిస్తోంది.
Read More: BJP: పెగాసస్… బీజేపీ సర్కారు బుక్కయిపోతున్నట్లేగా!
గతంలోనూ
ఇదిలాఉండగా, గత నెల 22న కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలుడు పశ్చిమ బెంగాల్ లోని తాతను కలిసేందుకు సరిహద్దులు దాటి వచ్చాడు. ఆర్మీ వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారులకు అప్పగించారు. కాగా, స్వల్ప వ్యవధిలోనే ఇలా బాలురు సరిహద్దులు దాటుతుండటం సంచలనంగా మారింది. పాక్ ఇలా ఎత్తుగడలు వేస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.