దేశంలో అన్ లాక్ తర్వాత రైళ్లకు డిమాండ్ వారి స్థాయిలో పెరిగింది. కరోనా కారణంగా రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రాలేకపోవడంతో దేశంలో పేద మధ్య తరగతి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలో లేకపోవడం అదే రీతిలో రాయితీలు వర్తించక పోవటంతో సామాన్యులకు రైల్వే ప్రయాణం పెనుభారంగా మారింది.
అంత మాత్రమే కాక ప్రత్యేక రైళ్లు అంటూ సాధారణం కంటే భారీ స్థాయిలో రైల్వే శాఖ వసూలు చేస్తోంది. ముఖ్యంగా రైల్వే శాఖ రిజర్వేషన్ల ప్రక్రియ ఆన్లైన్ చేయడంతో చదువు రాని వారు రైల్వేలో ప్రయాణించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అంతేకాకుండా రైల్వే సమయాలను పూర్తిగా మార్చటం రైల్వే ప్రయాణికులకు ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది.
ఇటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ సంక్రాంతి అయిన నేపథ్యంలో.. రైల్వేశాఖకు మంచి డిమాండ్ ఉన్న ఇలాంటి సమయంలో కూడా మొండివైఖరి ప్రదర్శిస్తూ రెగ్యులర్ రైలు నడపటానికి ముందుకు రాకపోవటంతో ప్రయాణికులు రైల్వే శాఖ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఏదిఏమైనా రెగ్యులర్ రైలు అందుబాటులోకి రాకపోవటంతో స్పెషల్ ట్రైన్ ల లో భారీ స్థాయిలో టికెట్ కొని ప్రయాణించడానికి సామాన్యులు నలిగిపోతున్నారు.